PM Modi – ISRO Team : చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం : ప్రధాని మోడీ
PM Modi -ISRO Team : చంద్రయాన్ 3 విజయం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ ను అభినందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కాంప్లెక్స్ కు వెళ్లారు.
- By Pasha Published Date - 08:35 AM, Sat - 26 August 23
PM Modi -ISRO Team : చంద్రయాన్ 3 విజయం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ ను అభినందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కాంప్లెక్స్ కు వెళ్లారు. ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్తో పాటు చంద్రయాన్-3 మిషన్ లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఆయన కలిశారు. వారిలో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
#WATCH | Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/IO3YxuV4JE
— ANI (@ANI) August 26, 2023
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో నేను ఇండియాలో లేను. చంద్రుడిపై మన ల్యాండర్ దిగిందనే సంతోషంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అందుకే గ్రీస్ పర్యటన ముగించుకొని.. ఇస్రో శాస్త్రవేత్తలను కలిసేందుకు నేరుగా బెంగళూరుకు వచ్చాను. చంద్రయాన్-3 సక్సెస్ ను దేశానికి అందించిన సైంటిస్టులకు నా అభినందనలు’ అని పేర్కొన్నారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఈసందర్భంగా ప్రధాని (PM Modi – ISRO Team) ఇచ్చారు. చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేద్దామని ఆయన ప్రతిపాదించారు. ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగగానే ప్రధాని మోడీకి బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరిని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. ఇస్రోపై ప్రశంసల వర్షం కురిపించారు.
#WATCH | Bengaluru: Prime Minister Narendra Modi congratulates scientists of the ISRO team for the successful landing of Chandrayaan-3 on the Moon pic.twitter.com/xh7jDWdN4b
— ANI (@ANI) August 26, 2023
Tags
Related News
Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ
Modi Vs Rahul : కాంగ్రెస్ యువరాజును(రాహుల్ గాంధీ) భారత తదుపరిగా ప్రధానమంత్రిగా చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.