Petrol Diesel: ఏపీ, తెలంగాణలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి.
- By Gopichand Published Date - 07:48 AM, Wed - 4 October 23
Petrol Diesel: పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరుగుతోంది. WTI ముడి చమురు బ్యారెల్కు 0.21 శాతం పెరుగుదలతో $ 89.42 వద్ద ఉంది. బ్రెంట్ ముడి చమురు ఎటువంటి మార్పు లేకుండా బ్యారెల్కు $ 91.05 వద్ద ఉంది.
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 చొప్పున విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా విక్రయిస్తున్నారు. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.74, డీజిల్ రూ.94.33గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 109. 66, లీటర్ డీజిల్ రూ. 97. 82 కాగా విజయవాడలో పెట్రోల్ రూ. 111.89, లీటర్ డీజిల్ రూ. 99.63గా ఉంది.
Also Read: Gold- Silver: భారీగా పడిపోతున్న గోల్డ్ రేట్స్.. బంగారంపై రూ. 600, వెండిపై రూ. 2000 తగ్గిన ధరలు..!
We’re now on WhatsApp. Click to Join
గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. భారత్ లో 2017 జూన్ నుంచి పెట్రోల్ ధరలను ప్రతి రోజు సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరిస్తారు. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 2017 జూన్ కు ముందు రెండు వారాలకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవారు.
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ధరను తెలుసుకోవడానికి BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్కు పంపాలి. ఇండియన్ ఆయిల్ కస్టమర్ల ధరను తెలుసుకోవడానికి RSP <డీలర్ కోడ్>ని 9224992249 నంబర్కు పంపండి. HPCL కస్టమర్లకు ఇంధన ధరను తెలుసుకోవడానికి, HPPRICE <డీలర్ కోడ్> అని వ్రాసి 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.
Related News
Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.. 180 మంది ప్రయాణికులు సేఫ్
మహారాష్ట్రలోని పూణె విమానాశ్రయంలో గురువారం (మే 16) పెను ప్రమాదం తప్పింది.