Paytm Payments Bank: పేటీఎంకు మరో బిగ్ షాక్.. పేమెంట్స్ బ్యాంక్ సీఈవో, ఎండీ రాజీనామా
ఫిన్టెక్ కంపెనీ పేటీఎం (Paytm Payments Bank) కష్టాలు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. మంగళవారం కంపెనీకి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి.
- By Gopichand Published Date - 09:40 AM, Wed - 10 April 24
Paytm Payments Bank: ఫిన్టెక్ కంపెనీ పేటీఎం (Paytm Payments Bank) కష్టాలు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. మంగళవారం కంపెనీకి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ముందుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈవో, ఎండీ సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. పేమెంట్స్ బ్యాంక్.. ఆర్బీఐ నుండి ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీని తర్వాత పేటీఎం మార్కెట్ వాటా సుమారు 2 శాతం క్షీణించినట్లు NPCI డేటా వెల్లడించింది. ఈ షాక్ల కారణంగా మంగళవారం కూడా పేటీఎం షేర్లు క్షీణించాయి. బీఎస్ఈలో పేటీఎం షేర్లు 1.95 శాతం పడిపోయి రూ.404.30 వద్ద ముగిసింది.
వ్యక్తిగత కారణాలతో సురిందర్ చావ్లా రాజీనామా చేశారు
పేటీఎం మాతృ సంస్థ One 97 కమ్యూనికేషన్స్ మంగళవారం తెలిపింది. Paytm పేమెంట్స్ బ్యాంక్ MD, సీఈవో సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణాల వల్ల ఏప్రిల్ 8న తన పదవికి రాజీనామా చేశారు. స్టాక్ మార్కెట్ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. జూన్ 26, 2024న ఆయన బాధ్యతల నుండి రిలీవ్ అవుతారని కంపెనీ తెలిపింది. పేమెంట్స్ బ్యాంక్తో అన్ని ఒప్పందాలను ముగించుకున్నామని One 97 కమ్యూనికేషన్స్ తెలిపింది. బ్యాంక్ బోర్డులో 5 మంది స్వతంత్ర డైరెక్టర్లు, ఒక ఛైర్మన్ ఉన్నారు.
Paytm మార్కెట్ వాటా ఇప్పుడు 9 శాతం
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. ఫిబ్రవరిలో Paytm మార్కెట్ వాటా 11 శాతంగా ఉంది. మార్చిలో ఇది కేవలం 9 శాతానికి తగ్గింది. ఫిబ్రవరిలో కంపెనీ 1.3 బిలియన్ల UPI లావాదేవీలు చేసింది. ఇది మార్చిలో 1.2 బిలియన్లకు తగ్గింది. జనవరి 2024లో ఈ సంఖ్య 1.4 బిలియన్లు. పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించినప్పటి నుంచి ఈ సంఖ్య నిరంతరం తగ్గుతూ వస్తోంది.
We’re now on WhatsApp : Click to Join
ఫోన్పే, గూగుల్ పే లావాదేవీలు పెరిగాయి
NPCI ప్రకారం.. పేటీఎం పోటీ సంస్థలు ఫోన్పే, గూగుల్ పే నిరంతరం వృద్ధి చెందుతున్నాయి. మార్చిలో Google Pay ద్వారా 5 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఇది ఫిబ్రవరిలో కంటే 6.3 శాతం ఎక్కువ. మార్చిలో PhonePe ద్వారా 6.5 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఇది ఫిబ్రవరిలో కంటే 5.2 శాతం ఎక్కువ.
Related News
MDH- Everest: భారత్లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.