Pakistani Intruder: పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చిన భద్రతా బలగాలు
సాంబా అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడు (Pakistani Intruder) హతమయ్యాడు.
- By Gopichand Published Date - 09:35 AM, Thu - 1 June 23
Pakistani Intruder: సాంబా అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడు (Pakistani Intruder) హతమయ్యాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నారు. మూలాల ప్రకారం.. పాకిస్తాన్ నుండి నిరంతర చొరబాటు ప్రయత్నాల గురించి ఇన్పుట్లు అందుకున్న తరువాత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
గురువారం అర్థరాత్రి IB వద్ద కొంత కదలికను జవాన్లు గమనించారు. దీంతో ఆయన అలర్ట్ అయ్యారు. సరిహద్దులో కదలికలను చూసిన భద్రతా బలగాలు చొరబాటుదారుడికి సవాలు విసిరినప్పటికీ అతను సరిహద్దు వైపు కదులుతూనే ఉన్నాడు. చర్య తీసుకుంటుండగా సైనికులు అతన్ని చంపారు. అతడిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతకుముందు పూంచ్లో, కర్మదా సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నార్కో-టెర్రరిజం ప్రధాన కుట్రను భగ్నం చేయడం ద్వారా భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి.
Also Read: Andhra Pradesh : ఏపీలో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం – ఐఎండీ
గురువారం అర్థరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని మంగు చక్ పోస్ట్ సమీపంలో పాక్ చొరబాటుదారుడిని BSF హతమార్చింది. BSF పదే పదే ఆపిన తర్వాత కూడా అతను ఆగలేదు. ఆ తర్వాత అప్రమత్తమైన BSS జవాన్లు అతనిపై కాల్పులు జరిపారు. అందులో చొరబాటుదారుడు మరణించాడు. మృతదేహం ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పడి ఉంది.
ఈ సంఘటన గురించి వివరాలను తెలియజేస్తూ.. ఈరోజు తెల్లవారుజామున సాంబా ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి అంతర్జాతీయ సరిహద్దును దాటుతున్న వ్యక్తిని BSF సిబ్బంది గమనించారని జమ్మూ BSF అధికారులు తెలిపారు. సైనికులు అతన్ని హెచ్చరించినప్పటికీ చొరబాటుదారుడు సరిహద్దు కంచె వైపు కదులుతూనే ఉన్నాడు. దీంతో జవాన్లు అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.
Related News
PM Modi : త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు: ప్రధాని మోడీ
Jammu And Kashmir: కేంద్రపాలిత ప్రాంతం(union territory) జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా(State status) లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా శుక్రవారం ఉధంపూర్(Udhampur)లో బీజేపీ(bjp) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు స్టార్ క్యాంపెయినర్గా మోదీ ప్రసంగించా�