Speed News
-
Kuppam : కుప్పం ప్రజల కల నెరవేర్చిన కృష్ణా జలాలు.. కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి
ఇది కేవలం నీటి రాక మాత్రమే కాదు, చరిత్రలో గుర్తించదగిన ఘట్టం. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Date : 30-08-2025 - 2:06 IST -
BRS : కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరోసారి హైకోర్టుకు హరీశ్రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.
Date : 30-08-2025 - 12:59 IST -
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో నుంచి గణేశ్ భక్తులకు శుభవార్త
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రుల సందడి ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ పండుగ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో, భక్తుల సౌకర్యార్థం మెట్రో రైల్ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 30-08-2025 - 12:00 IST -
Cloudburst : జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి వైపరిత్యం..రియాసిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం, భారీ నష్టం
ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, ఒక పాఠశాల తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాందీపురా జిల్లాలోని గురేజ్ సెక్టార్లోనూ అదే రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. తులేల్ అనే సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
Date : 30-08-2025 - 11:42 IST -
Telangana : తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం..సంతాప తీర్మానాలతో తొలి రోజు
ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా సభలు నివాళులర్పించాయి. శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన సభ్యులను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభకు పరిచయం చేస్తూ వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు.
Date : 30-08-2025 - 11:11 IST -
KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..
KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి సారించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదనే సమాచారం వెలువడటంతో చర్చలు మరింత రగిలాయి.
Date : 30-08-2025 - 11:07 IST -
PM Modi : జపాన్లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోదీ సమావేశమయ్యారు.
Date : 30-08-2025 - 10:59 IST -
Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్
Gold Price : బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న ఈ ధరకలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేడు మరోసారి బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగి షాక్ ఇచ్చాయి.
Date : 30-08-2025 - 10:47 IST -
Godavari : ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది.. జలదిగ్బంధంలో బాసర ఆలయం
Godavari : ప్రస్తుతం బాసరలో ఉన్న పరిస్థితులను గమనించి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆలయ సందర్శనకు రావాలని అధికారులు కోరుతున్నారు
Date : 30-08-2025 - 10:43 IST -
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన విమర్శలు
Asaduddin Owaisi: హైదరాబాద్ దారుసలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ మహిళల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై ఇలాంటి సూచనలు చేయడం పూర్తిగా అనవసరమని, ఇది మహిళలపై అదనపు భారం మోపే ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 30-08-2025 - 10:14 IST -
Bar License Lottery : నేడు ఏపీలో బార్ల లైసెన్స్ లాటరీ
Bar License Lottery : ఈ లాటరీ విధానం పారదర్శకతను పెంచేందుకు ఉద్దేశించింది. బార్ల లైసెన్స్లను దరఖాస్తుల ఆధారంగా కాకుండా, లాటరీ ద్వారా కేటాయించడం ద్వారా అక్రమాలకు తావు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
Date : 30-08-2025 - 7:29 IST -
Telangana Local Body Elections : స్థానిక ఎన్నికలపై ఇవాళ తుది నిర్ణయం!
Telangana Local Body Elections : ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, సెప్టెంబర్ మొదటి వారంలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది
Date : 30-08-2025 - 7:26 IST -
Reliance Intelligence : భారత్లో కృత్రిమ మేధ..’రిలయన్స్ ఇంటెలిజెన్స్’ రూపంలో కొత్త విప్లవం: ముకేశ్ అంబానీ
భారతదేశంలో ఈ ఏఐ విప్లవాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున, ఆయన ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 29-08-2025 - 5:04 IST -
Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తింపు డిమాండ్ పై సుప్రీంకోర్టులో కీలక ముందడుగు
సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్లో రామసేతువు మతపరమైన, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలన్న డిమాండ్ను ఆయన ఏళ్లుగా వినిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Date : 29-08-2025 - 4:46 IST -
Hypertension : ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు నియంత్రణకు కొత్త ఆన్లైన్ టూల్
Hypertension : భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన నిపుణులు కలసి ఒక వినూత్న ఆన్లైన్ ఆధారిత టూల్ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా రక్తపోటు (హైపర్టెన్షన్) చికిత్సలో కొత్త దారులు తెరుచుకోనున్నాయి.
Date : 29-08-2025 - 2:45 IST -
Milad-un-Nabi celebration : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ సోదరులు..కీలక విజ్ఞప్తులు సమర్పణ
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ మసీదులు, దర్గాలను విద్యుదీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఉచితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భక్తి, విశ్వాసాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పండుగ ఏర్పాట్లు జరగాలని వారు అభిప్రాయపడ్డారు.
Date : 29-08-2025 - 1:44 IST -
Bihar : బీహార్ లో బీజేపీ-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫైట్
Bihar : ఈ సంఘటనపై ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని బీజేపీ ఆరోపించగా, శాంతియుతంగా నిరసన తెలిపిన తమ కార్యకర్తలపై బీజేపీ దౌర్జన్యం చేసిందని కాంగ్రెస్ ప్రతివిమర్శించింది
Date : 29-08-2025 - 1:33 IST -
Nara Lokesh : విశాఖలో మంత్రి లోకేశ్ 68వ రోజు ప్రజాదర్బార్
Nara Lokesh : విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్కి విపరీతమైన స్పందన లభించింది. శుక్రవారం ఉదయం ఆయన పర్యటనలో భాగంగా నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో వరుసగా 68వ రోజు ప్రజాదర్బార్ను ఏర్పాటు చేశారు.
Date : 29-08-2025 - 1:23 IST -
Urjit Patel : ఉర్జిత్ పటేల్కు అంతర్జాతీయ గౌరవం..IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం
ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు.
Date : 29-08-2025 - 12:58 IST -
Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష
Lobo: యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్కు సంబంధించిన 2018 రోడ్డు ప్రమాద కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగామ కోర్టు ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
Date : 29-08-2025 - 12:52 IST