Nayan & Vignesh: వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్న నయనతార దంపతులు!
కోలీవుడ్ లవబర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్ తమిళనాడులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 05:02 PM, Fri - 10 June 22

కోలీవుడ్ లవబర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్ తమిళనాడులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నా జంట పెళ్లితో ఒక్కటయ్యారు. నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరు శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొందరు భక్తులు ఈ జంటను చూసేందుకు ఉత్సాహం చూపారు. నయనతార అభిమానులు ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.
#Nayanthara and #VigneshShivan at thirumala temple today. #WikkiNayan #WikkiNayanWedding #Nayantharawedding pic.twitter.com/CB8ofd4td6
— NAYANwedsWIKKI🎊 (@kalonkarthik) June 10, 2022
Related News

TTD : రేపు సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు(బుధవారం) ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక