Earthquake Strikes Morocco: మొరాకోలో భారీ భూకంపం.. 300 మందికి పైగా మృతి, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
శుక్రవారం అర్థరాత్రి మొరాకోలో 6.8 తీవ్రతతో భూకంపం (Earthquake Strikes Morocco) సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
- By Gopichand Published Date - 09:23 AM, Sat - 9 September 23
Earthquake Strikes Morocco: శుక్రవారం అర్థరాత్రి మొరాకోలో 6.8 తీవ్రతతో భూకంపం (Earthquake Strikes Morocco) సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూకంపం కారణంగా భవనాలు చాలా దెబ్బతిన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 11:11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మరకేష్కు నైరుతి దిశలో 71 కి.మీ దూరంలో 18.5 కి.మీ లోతులో ఉంది. మొరాకోలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో షేర్ చేయబడిన కొన్ని వీడియోలు భవనం కూలిపోతున్నట్లు, వీధుల్లో చెత్తాచెదారం ఉన్నట్లు చూపించాయి. ప్రజలు షాపింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ల నుండి బయటకు పరుగులు తీయడం, ఖాళీ స్థలాలలో గుమిగూడడం కనిపించింది. మళ్లీ భూకంపం వస్తుందనే భయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మొరాకోకు సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది: ప్రధాని మోదీ
ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయాని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు మొరాకో ప్రజలతో ఉన్నాయి. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది అని ట్వీట్ చేశారు.
Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to…
— Narendra Modi (@narendramodi) September 9, 2023
న్యూజిలాండ్లోని కెర్మాడెక్ దీవుల్లో బలమైన భూకంపం
ఇది కాకుండా న్యూజిలాండ్లోని కెర్మాడెక్ దీవుల దక్షిణ ప్రాంతంలో శుక్రవారం కూడా బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. జిఎఫ్జెడ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఈ సమాచారాన్ని ఇచ్చింది. GFZ ప్రకారం.. గ్రీన్విచ్ మీన్ టైమ్ ప్రకారం భూకంపం శుక్రవారం ఉదయం 09:09 గంటలకు సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం 33.23 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 178.17 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, ఉపరితలం నుండి 80.3 కి.మీ లోతులో ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదిక లేదు.
Related News
PM Modi : ‘‘ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లు’’ అంటే ముస్లింలే కాదు.. పేదలు కూడా : మోడీ
ఎన్నికల ప్రచారం వేళ వివాదాస్పదంగా మారిన తన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివరణ ఇచ్చారు.