Murder : కాకినాడలో దారుణం.. రవాణా శాఖ అధికారిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్పై ఓ వ్యాపారి కత్తితో దాడి చేశాడు.
- By Prasad Published Date - 05:15 PM, Fri - 17 March 23
![Murder : కాకినాడలో దారుణం.. రవాణా శాఖ అధికారిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/09/murder.jpg)
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్పై ఓ వ్యాపారి కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. తనిఖీల్లో భాగంగా రవాణా శాఖ బ్రేక్ ఇన్ స్పెక్టర్ కొబ్బరికాయల విక్రేతను లైసెన్స్ విషయమై ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు అధికారిపై సదరు వ్యాపారి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కత్తిపోట్లకు గురైన బ్రేక్ ఇన్స్పెక్టర్ వేలు కోల్పోయాడు. స్థానికుల సహాయంతో అధికారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బ్రేక్ ఇన్స్పెక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![YS Jagan; వైసీపీ కార్యకర్త హత్య అనంతరం వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/1463635-jagan_11zon.jpg)
YS Jagan; వైసీపీ కార్యకర్త హత్య అనంతరం వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి తన కాన్వాయ్లో వినుకొండకు బయలుదేరారు. నిన్న వైసీపీలో గ్యాంగ్ వార్ జరిగింది. రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ జిలానీ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు.