Semi-Final: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు బెదిరింపు.. నిఘా పెంచిన ముంబై పోలీసులు..!
క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో (Semi-Final) భాగంగా బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
- By Gopichand Published Date - 10:53 AM, Wed - 15 November 23
Semi-Final Clash: క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో (Semi-Final) భాగంగా బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అంతకుముందే మ్యాచ్ని టార్గెట్ చేస్తారనే బెదిరింపు వచ్చింది. వాస్తవానికి ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. అందులో మ్యాచ్ సమయంలో కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతాయని చెప్పబడింది. ముంబై పోలీసులకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఈ తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ముంబై పోలీసులు వాంఖడే స్టేడియం,దాని పరిసర ప్రాంతాలపై నిఘా ఉంచారు.
బెదిరింపు చేసిన వ్యక్తి తుపాకీ, హ్యాండ్ గ్రెనేడ్, బుల్లెట్ల ఫోటోతో సోషల్ మీడియా సైట్ X (గతంలో ట్విట్టర్) లో ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు. దీంతో పాటు మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిప్పులు చెరిగేస్తాం అనే సందేశంతో కూడిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
ముంబై పోలీసులు ఏం చెప్పారు..?
ముంబై పోలీసులు మాట్లాడుతూ.. ఈరోజు వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో దుర్మార్గమైన సంఘటన జరుగుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు X (గతంలో ట్విట్టర్)లో బెదిరింపు సందేశాన్ని పోస్ట్ చేశాడు. స్టేడియం పరిసరాలు, పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాం. ఆ వ్యక్తి తన పోస్ట్లో ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు. ఒక ఫోటోలో తుపాకీ, గ్రెనేడ్లు, బుల్లెట్లను చూపించాడని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
Related News
NTR : ఓయ్ అంటూ కోపంతో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
NTR మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో వార్ 2 సినిమాకు సైన్ చేశాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్