Mulayam Singh Yadav : సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
- By Prasad Published Date - 05:45 PM, Sat - 9 July 22
గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా యాదవ్ కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం మెదాంత మెడిసిటీ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో ఉన్న ఆమెను చూసేందుకు ములాయం సింగ్ యాదవ్ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధన గుప్తా ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య, ఆమె అతని కంటే 20 సంవత్సరాలు చిన్నది. ఆమె కొడుకు పేరు ప్రతీక్ యాదవ్ కాగా, ఆమె కోడలు అపర్ణ యాదవ్ భారతీయ జనతాపార్టీ నాయకురాలిగా ఉన్నారు.
Related News
Manifesto : సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party) ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)ను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) బుధవారం విడుదల చేశారు. 2025 నాటికి కుల గణన చేపడతామని, అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంత�