Mulayam Singh Yadav : ములాయం సింగ్ యాదవ్ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం
ఎస్పీ అధినేత, ఉత్తరప్రదేవ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
- By Prasad Published Date - 10:54 AM, Mon - 10 October 22
ఎస్పీ అధినేత, ఉత్తరప్రదేవ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ గారి మరణవార్త తనను ఎంతో బాధ కలిగించిందన్నారు. తనకు అత్యంత ఆప్తులు, సోదరుడిని ఈ రోజు కోల్పోయానని… 4 దశాబ్దాలుగా హుందా రాజకీయాలతో తనను ఎప్పుడూ ఆకట్టుకున్న నేత ములాయం సింగ్ యాదవ్ అని చంద్రబాబు తెలిపారు. ఆయనతో కలిసి గతంలో పనిచెయ్యడం తన అదృష్టంగా భావిస్తున్నానని… తన ఆలోచనల ద్వారా లక్షలాది మంది జీవితాలను ములాయంసింగ్ యాదవ్ మార్చారన్నారు. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deeply saddened to learn about the passing of Mulayam Singh Yadav Ji. I lost a dear brother today. Over 4 decades, I have had the fortune of spending plenty of time with the OBC stalwart who always impressed me with his charm, humility & deep understanding of Indian politics(1/2) pic.twitter.com/ZeSs83znDr
— N Chandrababu Naidu (@ncbn) October 10, 2022
Related News
Vallabhaneni Vamsi : వంశీ తన ఓటమిని ముందుగానే గ్రహించాడా..?
ఏపీ రాజకీయాలు అంటే గుర్తుకు వచ్చేవి వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలు. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. ఈ సారి టీడీపీ కూటమి గెలిపించేందుకు ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్రావాసులు తమ సొంతూళ్లకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.