Telangana Bonalu : బోనాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చింది – మంత్రి తలసాని
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని
- By Prasad Published Date - 08:57 PM, Sun - 16 July 23
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండ లో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయన్నారు. బోనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతుందని.. ఏ ప్రభుత్వాలు దేవాలయాలకు నిధులు ఇవ్వడం లేదని..ఒక్క తెలంగాణలోనే ఆలయాలకు నిధులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని అమ్మవారి ని కోరుకున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఢిల్లీ లో కూడా బోనాల జాతర చేసి తెలంగాణ సంప్రదాయంను చాటిచెప్పారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఐక్యత తో బోనాల ఉత్సవాలు చేసుకోవాలని కోరారు.
Related News
Khammam : పొంగులేటి ఎదుట గొడవకు దిగిన కాంగ్రెస్ నేతలు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్లో వర్గ పోరు భగ్గుమంది