World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్కు బాంబు బెదిరింపు
అక్టోబర్ 14న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 05:39 PM, Wed - 11 October 23
World Cup 2023: ప్రపంచ కప్ మొదలైంది. టీమిండియా తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి వన్డే ప్రపంచకప్లో బోణీ కొట్టింది. ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ భారత్ను విజయతీరాలకు చేర్చారు. అక్టోబర్ 14న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి చేస్తామని బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ బెదిరింపుతో గుజరాత్ పోలీసులు మోదీ స్టేడియానికి భద్రత రెట్టింపు చేశారు. అణువణువు గాలిస్తున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కరణ్ మావి అనే నిందితుడిని రాజ్కోట్లో అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. బాంబ్ బెదిరింపు అంశాన్ని హిందీలో రాసి మెయిల్ ద్వారా బీసీసీఐకి పంపాడు. 14-10-2023న నరేంద్ర మోదీ స్టేడియంలో పేలుడు జరుగుతుందని మెయిల్ లో పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన మావిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది.
Related News
India squad: టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ప్రకటనకు మూహర్తం ఫిక్స్..!
పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ ఎంపిక మేరకు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 29 లేదా మే 1న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించవచ్చు.