UP Polls:యూపీలో ఎస్పీకి’ మమత ‘మద్దతు
యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
- By CS Rao Published Date - 09:41 PM, Tue - 18 January 22
యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
మంగళవారం కోల్కతాలో మమతా బెనర్జీని కలిసిన కిరణ్మోయ్ నందా ఆ మేరకు వెల్లడించాడు.ఫిబ్రవరి 8న లక్నోలో అఖిలేష్ యాదవ్తో కలిసి TMC చీఫ్ జాయింట్ వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తారని చెప్పాడు.
ఆ తర్వాత వారణాసిలో వర్చువల్ ర్యాలీకి కూడా ఇద్దరు నేతలు ప్లాన్ చేస్తున్నారని కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
యుపి ఎన్నికల సమయంలో టిఎంసి ,ఎస్పికి బయటి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
యుపిలో టిఎంసి అభ్యర్థులను నిలబెట్టదు మరియు సమాజ్వాదీ పార్టీకి బయటి మద్దతును అందిస్తుంది, ”అని కోల్కతాలో పశ్చిమ బెంగాల్ సిఎంను కలిసిన తరువాత SP నాయకుడు కిరణ్మోయ్ నందా వివరించాడు.
Tags
Related News
JP Nadda : వారికోసం కేంద్రంలో ‘బలహీనమైన ప్రభుత్వాన్ని’ మమతా బెనర్జీ కోరుకుంటున్నారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చొరబాటు విషయంలో రాజీపడి మైనారిటీలను మభ్యపెడుతున్నారని ఆరోపించిన బిజెపి చీఫ్ జెపి నడ్డా, రాష్ట్రంలో టిఎంసి దశాబ్దాల పాలనలో పశ్చిమ బెంగాల్లో ఒకదాని తర్వాత మరొకటి కుంభకోణం జరిగిందని అన్నారు.