Ankura Hospital: మంటల్లో అంకుర ఆసుపత్రి
మెహిదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జ్యోతినగర్ ప్రాంతంలోని పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం. 68కి సమీపంలో ఉన్న అంకురా ఆసుపత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
- By Praveen Aluthuru Published Date - 07:22 PM, Sat - 23 December 23
![Ankura Hospital: మంటల్లో అంకుర ఆసుపత్రి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/12/fireaccidentinhospitalathyderabad-1703339127.jpg)
Ankura Hospital: మెహిదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జ్యోతినగర్ ప్రాంతంలోని పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం. 68కి సమీపంలో ఉన్న అంకురా ఆసుపత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 5:30 గంటలకు ఆసుపత్రి భవనం పైన ఉన్న ఫ్లెక్సీ నుండి మంటలు చెలరేగాయని ప్రాధమిక సమాచారం.
ముందు ఆరో అంతస్థులో మంటలు వ్యాపించి క్రమంగా అన్ని అంతస్థులకు వ్యాపించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ముందుజాగ్రత్తగా ఆస్పత్రిలోని రోగులను అక్కడి నుంచి తరలించారు. ఆస్పత్రిలో ఎక్కువగా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు వుండటంతో వారిని బయటకు తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Terrible #Hyderabad: Major Fire broke out in Ankura Hospital situated near Pillar no 68 of PVNR Expressway in the Jyothinagar area of Mehdipatnam today. pic.twitter.com/sVLDb10dwD
— @Coreena Enet Suares (@CoreenaSuares2) December 23, 2023
Also Read: Crimes Rate: సైబరాబాద్లో పెరిగిన నేరాలు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Telangana- AP CMs: ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ముహూర్తం ఖరారు.. వేదికగా ప్రగతి భవన్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/Chandrababu-Revanth.jpg)
Telangana- AP CMs: ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ముహూర్తం ఖరారు.. వేదికగా ప్రగతి భవన్..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిని విషయం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల (Telangana- AP CMs) భేటీనే.