HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Maharashtra Police Suspect Human Error Behind Buldhana Crash That Killed 25

Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై పోలీసుల అనుమానం

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • By Praveen Aluthuru Published Date - 07:30 PM, Sat - 1 July 23
  • daily-hunt
25 People Died
25 People Died

Maharashtra Bus Accident: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు డివైడర్‌ను ఢీకొనగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 25 మంది ప్రయాణికులు చనిపోయారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు భయపడుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పగిలిపోవడంతో బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్తుండగా.. డ్రైవర్ నిద్రమత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు భావిస్తున్నారు.

నాగ్‌పూర్ నుంచి పూణె వెళ్తున్న బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సింధ్‌ఖేడ్రాజా సమీపంలోని పింపాల్‌ఖుటా గ్రామంలో తెల్లవారుజామున 1.30 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది, ఇందులో 25 మంది ప్రయాణికులు మరణించారు. బస్సు డ్రైవర్, క్లీనర్‌తో సహా మరో ఎనిమిది మంది పగిలిన కిటికీలోంచి బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

రాత్రి భోజనం కోసం యవత్మాల్ జిల్లాలోని కరంజా వద్ద బస్సు ఆగింది. ఆ తర్వాత బస్సు ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ క్యారేజ్‌వేలో సింధ్‌ఖేడ్‌రాజా వరకు దాదాపు రెండున్నర గంటల్లో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీంతో బస్సు సగటు వేగం గంటకు 60-70 కి.మీ. అయితే స్పీడ్ సమస్య కాదని పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమికంగా చూస్తే ఇది మానవ తప్పిదమేనని తెలుస్తోంది. అయితే బస్సు టైరు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, అయితే ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రమాదం అనంతరం డీజిల్‌ ట్యాంక్‌ పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి.

డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై టైరు పగిలి ప్రమాదం జరగలేదని, ఘటనా స్థలంలో రబ్బరు ముక్కలుగానీ, టైర్ గుర్తులు గానీ లేవని అమరావతి ప్రాంతీయ రవాణా కార్యాలయం నివేదిక పేర్కొంది.

Read More: Jagananna Suraksha : ప్రజల వద్దకు పాలన సీఎం జగన్‌ లక్ష్యం.. విజ‌య‌వంతంగా జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 25 killed
  • Buldhana
  • bus accident
  • fire
  • human error
  • Maharashtra
  • police
  • suspect

Related News

Rep And Murder

Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

Maharashtra : పాలఘర్ జిల్లాకు చెందిన నీలేశ్ ధోంగ్డా అనే యువకుడి వివాహ నిశ్చితార్థం బిబల్దార్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికతో జరిగింది

  • Bomb Threat

    Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Do you know who was the first person to buy the first Tesla car in India?

    Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

Latest News

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd