HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kurukshetra Struggle Will Take Place In Next Five Weeks Cm Jagan

CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్

నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి (CM Jagan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు.

  • Author : Gopichand Date : 04-04-2024 - 7:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan
Jagan Proddutur

CM Jagan: నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి (CM Jagan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను ఎన్నుకునేందుకు జ‌రుగుతున్న ఎన్నికలు కావు ఇవి, అందరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలేన‌ని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలేని చెప్పుకొచ్చారు.

జగన్ ఓడించేందుకు కూట‌మి నాయ‌కులు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్నాయని, ఒక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్నవారికి, ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు..నే డు ద్వారా పాఠశాలల రూప రేఖలు మార్చిన మనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సమతుల్యం దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ..మైనార్టీలకు కేటాయించామ‌న్నారు. ఎక్కడా వివక్ష ..లంచాలు లేకుండా లబ్దిని అర్హులకు అందించామ‌ని తెలిపారు. పెన్షన్లను ఇంటికే వచ్చి ఇచ్చామని స్ఫ‌ష్టం చేశారు. ఇప్పుడు యుద్ధం ఏ స్థాయిలో జరుగుతోందో చూస్తున్నాం క‌దా అని ప్ర‌శ్నించారు. ప్రతి నెల ఒక‌టో తేదీన వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి అవ్వా తాతలకు పెన్షన్లను 58 నెలలగా ఇచ్చార‌ని తెలిపారు.

ఎన్నికలు రావడంతో జీర్ణించుకోలేక అసూయతో చంద్రబాబు తనకు సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు 1000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను రూ.3 వేలకు పెంచామ‌ని తెలిపారు. అందరూ ఆలోచన చేయాలని సీఎం జ‌గ‌న్ కోరారు. రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి.. చెడిపోయాయని తెలిపారు. అవ్వా.. తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్ ను ఆపించారని విమ‌ర్శ‌లు చేశారు. ఇలాంటి దుర్మార్గం వల్లే 31 మంది అవ్వ తాతలు నడ‌వ‌లేక అవస్థలు పడలేక ప్రాణాలు విడిచారన్నారు. రెండు రోజుల్లోనే ఇంతమంది మరణించడం బాధాకరమ‌ని అన్నారు. 31 మంది మరణానికి కారణమైన చంద్రబాబును హాంతకుడని అందామా..? అని ప్ర‌జ‌ల‌ను అడిగారు.

Also Read: Jeans Effects : టైట్ జీన్స్ వేసుకుంటున్నారా ? ఈ ప్రమాదం తప్పదు..

రెండు నెలలు ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామ‌ని తెలిపారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ఇంటింటికి సేవలు అందించే కార్యక్రమం పైన మొదటి సంతకం చేస్తా అని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా పని చేశాయో అందరు చూశారు క‌దా అని ప్ర‌శ్నించారు. మనం పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో చూశారు క‌దా అని తెలిపారు. ఇది చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఆరోపించారు. జగన్ మామ అని చిన్నారులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారని సీఎం గుర్తుచేశారు. మీ భవిష్యత్ మార్చేందుకే 58 నెలలు కష్టపడ్డానని పేర్కొన్నారు.

చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఆయన చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా..? అని ప్ర‌శ్నించారు. ఆయన మార్క్ పథకం ఏదీ లేదన్నారు. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్ను పోట్లు.. అబద్ధాలు.. కుట్రలు కుతంత్రాలు అని తెలిపారు. 58 నెలల్లో మనం మంచి సమాజాన్ని నిర్మించామ‌ని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పను.. మోసాలు చేయమ‌ని ప్ర‌జ‌ల‌కు తెలిపారు. అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో పెట్టనని తెలిపారు. జగన్ అమలు చేయలేని ఏ స్కీము కూడా చంద్రబాబు కాదు.. ఎవరూ అమలు చేయలేరని తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 AP Assembly elections
  • ap politics
  • bjp
  • cm jagan
  • Janasena
  • tdp
  • ycp

Related News

Pawan Janasena2

జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు

  • Minister Vasamsetti Subhash

    భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

  • Sajjala

    రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

  • APs Development

    అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు!

  • Amith Sha Tvk

    విజయ్ పార్టీ తో బిజెపి పొత్తు?

Latest News

  • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

  • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

  • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

  • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

  • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

Trending News

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd