KTR: ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరం: మంత్రి కేటీఆర్
- By Hashtag U Published Date - 04:50 PM, Wed - 21 June 23
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కిమ్స్ ఆసుపత్రిని సందర్శించి ఇటీవల జరిగిన ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన వారిని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్.. ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి త్వరగా కోలుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, ప్రమాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన మున్సిపల్ పరిపాలన శాఖ నిబద్ధతను మంత్రి కేటీఆర్ ఎత్తిచూపారు. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ, జేఎన్టీయూ యూనివర్శిటీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యానికి పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Related News
KTR: పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై కేటీఆర్ ధీమా.. పార్టీ నేతలకు ధన్యవాదాలు
KTR: ఈ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొనీ తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన ప