KTR: కేటీఆర్ సార్.. వరంగల్ టికెట్ నాకే ఇవ్వండి!
- By Balu J Published Date - 11:30 PM, Sat - 6 April 24
KTR: వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావుకు వినతి పత్రం సమర్పించారు. శనివారం నాడు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ కు మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం కలవడం జరిగింది.
మలి విడత తెలంగాణ పోరాటంలో మొట్టమొదట అరెస్ట్ అయిన 9 మంది విద్యార్థినేతల్లో వంగపెల్లి కీలకమైన వ్యక్తి అని, సాగరహారం, మిలియన్ మార్చ్ తో పాటు OU to KU విద్యార్థి పాదయాత్ర లీడ్ చేసిన వంగపల్లి శ్రీనివాస్ గారికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉందని. అలాగే మాదిగ జాతి కోసం 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తా…. అసెంబ్లీ ఎక్కిన సెక్రటేరియట్ ముట్టడించి అనేక ఆందోళన నిర్వహించిన వంగపల్లికి మాదిగ ఉద్యమ నేపథ్యం కూడా ఉన్నదని దండోరా పరంగా అత్యదిక కేసులను ఎదుర్కొన్న వ్యక్తి కూడా వంగపల్లి శ్రీనన్ననె కాబట్టి శ్రీనన్న కే టికెట్ ఇవ్వాలని కోరారు.
విషయాన్ని కులంకశంగా విన్న KTR గారు సానుకూలంగా స్పందించారు. BRS అదినేత KCR గారి దృష్టికి తీసుకెలుతానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోర్ కమిటి నాయకులు : పొట్టపింజర రమేష్, బంగారు శ్రీనివాస్, పాలడుగు శ్రీనివాస్, యాదగిరి, రాజెందర్, గడ్డం వెంకటేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Related News
AP Politics : ఉమ్మడి రాజధానిపై కేటీఆర్ & జగన్ వ్యూహం..?
ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల ఎన్నికల సీజన్. ప్రచారంలో పైచేయి సాధించేందుకు పార్టీలు రోజుకో వ్యూహం పన్నుతున్నాయి.