Kerala Nurse Nimisha Priya: కేరళ నర్స్ నిమిషాకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా!
భారతదేశానికి యెమెన్లో శాశ్వత దౌత్య కార్యాలయం (రాయబార కార్యాలయం) లేదు. 2015లో రాజకీయ అస్థిరత కారణంగా రాజధాని సనాలోని భారత రాయబార కార్యాలయం మూసివేయబడింది.
- By Gopichand Published Date - 02:38 PM, Tue - 15 July 25

Kerala Nurse Nimisha Priya: యెమెన్లో మరణ శిక్ష విధించబడిన కేరళ నర్స్ నిమిషా ప్రియా (Kerala Nurse Nimisha Priya) మరణ శిక్షను ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఆమెకు జులై 16న మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. న్యూస్ ఏజెన్సీ ANI మంగళవారం సమాచార వర్గాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం.. యాక్టివిస్ట్ గ్రూపులు, ప్రభావవంతమైన మత నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. దీని తర్వాత నిమిషా ప్రియా మరణ శిక్షను వాయిదా వేశారు. ఇంతకు ముందు నిమిషాను మరణ శిక్ష నుండి కాపాడేందుకు దౌత్య స్థాయిలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. బాధితుడి కుటుంబం ఇప్పటి వరకు క్షమాపణ లేదా బ్లడ్ మనీ స్వీకరించడానికి అంగీకరించలేదని కూడా వార్తలు ఉన్నాయి.
కేరళ గ్రాండ్ ముఫ్తీ బాధిత కుటుంబంతో మాట్లాడారు
మీడియా నివేదికల ప్రకారం.. యెమెన్కు చెందిన ప్రముఖ సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హాఫిజ్ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో యెమెన్ సుప్రీం కోర్టు జడ్జి, మృతుడి సోదరుడు కూడా పాల్గొంటున్నారు. షేక్ హబీబ్ను చర్చలకు ఒప్పించడానికి ముఫ్తీ ముసలియార్ సహకరించారు.
Also Read: Minister Uttam: కేంద్ర మంత్రి పాటిల్కి మంత్రి ఉత్తమ్ లేఖ.. అందులో కీలక విషయాలివే!
నివేదికల ప్రకారం భారతదేశంలోని కంథాపురం గ్రాండ్ ముఫ్తీ ఎ.పి. అబూబకర్ ముసలియార్ యెమెన్కు చెందిన ప్రముఖ సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హాఫిజ్ ఈ అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో యెమెన్ సుప్రీం కోర్టు జడ్జి, మృతుడి సోదరుడు కూడా ఉన్నారు.షేక్ హబీబ్ను చర్చలకు ఒప్పించడానికి ముఫ్తీ ముసలియార్ సహకరించారు. బాధిత కుటుంబానికి చెందిన ఒక సన్నిహిత సభ్యుడు చర్చలకు సిద్ధపడడం ఇదే మొదటిసారి. ఈ చర్చలు షరియా చట్టం కింద జరుగుతున్నాయి. ఇది బాధిత కుటుంబానికి షరతులు లేకుండా లేదా బ్లడ్ మనీ బదులుగా నిందితుడిని క్షమించే చట్టపరమైన హక్కును ఇస్తుంది.
నిమిషాపై యెమెన్ పౌరుడి హత్య కేసు
భారతీయ నర్స్ నిమిషా 2017 నుండి జైలులో ఉన్నారు. ఆమెపై యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీకి డ్రగ్ ఓవర్డోస్ ఇచ్చి హత్య చేసిన ఆరోపణ ఉంది. నిమిషా, మహదీ యెమెన్లో ఒక ప్రైవేట్ క్లినిక్లో భాగస్వాములుగా ఉన్నారు. మహదీ నిమిషా పాస్పోర్ట్ను తన ఆధీనంలో ఉంచుకుని, ఆమెను వేధించాడని ఆరోపణలు ఉన్నాయి.
భారతదేశానికి యెమెన్లో శాశ్వత దౌత్య కార్యాలయం (రాయబార కార్యాలయం) లేదు. 2015లో రాజకీయ అస్థిరత కారణంగా రాజధాని సనాలోని భారత రాయబార కార్యాలయం మూసివేయబడింది. దానిని జిబౌటీకి బదిలీ చేశారు. భారత ప్రభుత్వం యెమెన్ ప్రభుత్వంతో ప్రధానంగా ‘నాన్-రెసిడెంట్ రాయబారి’ ద్వారా సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం రియాద్లో ఉన్న రాయబారి ద్వారా చర్చలు జరుపుతోంది.