Earthquake: కాశ్మీర్లోని కత్రాలో స్వల్ప భూకంపం
జమ్మూ కాశ్మీర్లోని కత్రా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 3.28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది
- By Hashtag U Published Date - 08:59 AM, Fri - 26 August 22
జమ్మూ కాశ్మీర్లోని కత్రా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 3.28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. కత్రా 62 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన భూకంప కేంద్రం.
భూమికి దాదాపు 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూమి కంపించడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. గత రెండు రోజులుగా కత్రాలో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి.
An earthquake of magnitude 3.4 occurred 62km ENE of Katra, Jammu & Kashmir, at around 3:28 am today. The depth of the earthquake was 5 km below the ground: National Center for Seismology pic.twitter.com/mqgqAaacCP
— ANI (@ANI) August 25, 2022
Related News
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీ�