IndiGo Flight Emergency Landing: లక్నో నుండి అబుదాబి వెళ్తున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఘటన సమయంలో ఫ్లైట్ లో 155 మంది ప్రయాణికులు..!
లక్నో నుండి అబుదాబికి వెళ్తున్న ఇండిగో విమానంలో అకస్మాత్తుగా గాలిలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ విమానాశ్రయంలో వెంటనే అత్యవసర ల్యాండింగ్ (IndiGo Flight Emergency Landing) చేశారు.
- By Gopichand Published Date - 08:20 AM, Sun - 17 September 23
IndiGo Flight Emergency Landing: లక్నో నుండి అబుదాబికి వెళ్తున్న ఇండిగో విమానంలో అకస్మాత్తుగా గాలిలో సాంకేతిక సమస్య ఏర్పడింది. హైడ్రాలిక్స్ పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ విమానాశ్రయంలో వెంటనే అత్యవసర ల్యాండింగ్ (IndiGo Flight Emergency Landing) చేశారు. శనివారం రాత్రి 10:42 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 155 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనపై ఇండిగో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇటీవలి కాలంలో ఇండిగో విమానాల్లో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు వారాల క్రితం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షిని ఢీకొనడంతో వెంటనే భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆగస్ట్లో ఒక ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడంతో వైద్య అత్యవసర పరిస్థితి కోసం ఇండిగో విమానం నాగ్పూర్ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. మరో ఘటనలో ముంబై నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ల్యాండ్ అయిన వెంటనే ఆస్పత్రికి తరలించగా, మృతి చెందాడు.
Also Read: Plane Crash : బ్రెజిల్ లో కూలిన టూరిస్టు విమానం.. 14 మంది మృతి
అంతకుముందు మంగళవారం అదే రోజు కొన్ని గంటల వ్యవధిలో మిడ్-ఎయిర్ విమానాలలో సాంకేతిక సమస్యలు నివేదించబడ్డాయి. కోల్కతా నుంచి బెంగుళూరు వెళ్తున్న విమానం ఇంజన్ గాలిలోనే చెడిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మధురై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ కూడా మధ్యలోనే పనిచేయకపోవడంతో ఆ విమానం కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనలన్నింటిపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నారు. ఈ సాంకేతిక లోపాల గురించి కంపెనీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.
Tags
Related News
Visakhapatnam: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్
Visakhapatnam: ఎయిర్ ఏషియా విశాఖపట్నం-బ్యాంకాక్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విశాఖపట్నం నుండి విదేశీ విమానాన్ని ప్రవేశపెట్టిన రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థగా నిలిచింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమానం స్కూట్. వారానికి మూడు సార్లు (మంగళ, గురు, శనివారాలు) బ్యాంకాక్ కు ఎయిర్ ఏషియా విమానాలను నడపనుంది. బ్యాంకాక్ ను�