COVID-19 News Cases: దేశంలో 24 గంటల్లో 529 కొత్త కోవిడ్ కేసులు నమోదు
భారతదేశంలో ఒకే రోజు 529 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు గుజరాత్ నుండి ఒకరు మరణించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-12-2023 - 6:12 IST
Published By : Hashtagu Telugu Desk
COVID-19 News Cases: భారతదేశంలో ఒకే రోజు 529 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు. కర్ణాటక నుండి ఇద్దరు మరియు గుజరాత్ నుండి ఒకరు మరణించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిసెంబర్ 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. అయితే చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాగా 2020 ప్రారంభంలో ప్రారంభమైన ఈ మహమ్మారి గరిష్ట స్థాయికి రోజువారీ సంఖ్య లక్షల్లో ఉంది. 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు నాలుగు సంవత్సరాలలో 5.3 లక్షల మంది మరణించారు.
మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81 శాతంతో 4.4 కోట్లకు పైగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించారు.
Also Read: Eagle X Dhamaka : ఈగల్లో కొత్త రవితేజను చూస్తారు : మాస్ మహారాజా