Hyderabad : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: జార్ఖండ్ మాజీ సీఎం
- By Prasad Published Date - 10:29 PM, Fri - 1 July 22
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వంశపారంపర్య రాజకీయాలను నమ్మి కుటుంబం గురించే ఆలోచించడమే ఇందుకు కారణం. అని ఆయన అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదని.. కాబట్టి ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. రఘుబర్ దాస్ శుక్రవారం హైదరాబాద్లోని చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.
Tags
Related News
Phone Tapping Case: కేటీఆర్కు పదేళ్లు జైలు శిక్ష: కోమటిరెడ్డి
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రుజువైతే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పదేళ్ల జైలు శిక్ష తప్పదని అన్నారు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ స్వయంగా అంగీకరించారు