145 People Drowned: ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది జల సమాధి
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లులంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది (145 people drowned) మరణించారు. నదిలో 200 మంది ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
- By Gopichand Published Date - 02:32 PM, Fri - 20 January 23
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లులొంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది (145 people drowned) మరణించారు. నదిలో 200 మంది ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 145 మంది మరణించగా 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కాంగో వెళ్తుండగా బసన్ కును పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులు తమ సరుకులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా బసంకుసు పట్టణ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బోటులో ప్రయాణికులు, వస్తువులు, జంతువులతో నిండిపోవడంతో బోటు నదిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Als0 Read: Three sisters suicide: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. కారణమిదే..?
DRCలో పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఇక్కడ రోడ్లు లేకపోవడంతో ప్రజలు పడవల్లో ప్రయాణిస్తున్నారు. వలసలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతోంది. గతేడాది అక్టోబర్లో కాంగో నదిలో ఇలాంటి ఘటనే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు.
Tags
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.