Three sisters suicide: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. కారణమిదే..?
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య (Three sisters suicide) చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత(24), బిందు(21), చందన(18)ల తలిదండ్రులు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. వారిని పోషించిన అమ్మమ్మ 3 నెలల క్రితం మరణించింది.
- By Gopichand Published Date - 01:09 PM, Fri - 20 January 23
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య (Three sisters suicide) చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత(24), బిందు(21), చందన(18)ల తలిదండ్రులు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. వారిని పోషించిన అమ్మమ్మ 3 నెలల క్రితం మరణించింది. దీంతో ముగ్గురూ కుంగిపోయారు. గురువారం వారి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటి పైకప్పు తీసి చూడగా ముగ్గురూ ఉరివేసుకుని కనిపించారు.
Also Read: Gill and Sara Tendulkar: సారా టెండూల్కర్తో గిల్ ఎగేంజ్ మెంట్.. ట్వీట్ వైరల్!
గురువారం చిక్కనాయకనహళ్లి తాలూకాలోని బర్కనహళ్లి లంబాని తండాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. రంజిత (24), బిందు (21), చందన (18) జనవరి 11న ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, గురువారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. అమ్మమ్మతో అనుబంధం ఉన్నందున, ఆమె మరణం వారిని డిప్రెషన్లో కూరుకుపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ప్రతిపాదన వచ్చిందని పోలీసులు చెప్పారు. ముగ్గురు సోదరీమణులు కెబి క్రాస్లోని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని తిప్తూరు ఏఎస్పీ సిద్ధార్థ్ గోయల్, చిక్కనాయకహల్లిలో ఇన్స్పెక్టర్ నిర్మల సందర్శించారు.
Related News
Inter Results : ఇద్దరు ఇంటర్ అమ్మాయిలు సూసైడ్
ఇంటర్ లో ఫెయిల్ అయ్యినందుకు బాధపడుతూ తనువు చాలించారు