HIV Infection: 800 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్.. 47 మంది మృతి!
త్రిపురలో 47 మంది హెచ్ఐవి (HIV Infection) కారణంగా మరణించారు. 828 మంది విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించారు.
- Author : Gopichand
Date : 10-07-2024 - 9:29 IST
Published By : Hashtagu Telugu Desk
HIV Infection: త్రిపురలోని ఓ పాఠశాలలో విద్యార్థుల్లో ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన తీవ్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSSES) సీనియర్ అధికారి ప్రకారం.. త్రిపురలో 47 మంది హెచ్ఐవి (HIV Infection) కారణంగా మరణించారు. 828 మంది విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించారు. పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున డ్రగ్స్ వినియోగిస్తున్నారని టీఎస్ఎస్ఈఎస్ జాయింట్ డైరెక్టర్ తెలిపారు.
విద్యార్థులు ఇంజక్షన్ మందులు వేసుకుంటున్నారు
ఈ హెచ్ఐవి గణాంకాలకు సంబంధించి TSSES అధికారి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను HIV పాజిటివ్గా గుర్తించాం. వారిలో, 572 మంది విద్యార్థులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నారు. 47 మంది ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఇంజక్షన్ మందులు తీసుకునే విద్యార్థులను గుర్తించింది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో హెచ్ఐవీ సోకిన విద్యార్థి వాడిన ఇంజెక్షన్ను మరో విద్యార్థి వేస్తే వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు దాదాపు ప్రతిరోజూ ఐదు నుండి ఏడు కొత్త HIV కేసులు నమోదయ్యాయని ఇటీవలి డేటా చూపిస్తుంది.
Also Read: Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు కనిపించే సంకేతాలివే..!
HIVతో బాధపడుతున్న వ్యక్తుల మొత్తం సంఖ్య ఇదే
త్రిపుర జర్నలిస్ట్స్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, TSACS నిర్వహించిన మీడియా వర్క్షాప్లో TSACS జాయింట్ డైరెక్టర్ సుభ్రజిత్ భట్టాచార్య త్రిపురలో HIV పరిస్థితి వివరణాత్మక వివరణను అందించారు. ఇప్పటివరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్శిటీల్లో విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల డేటాను చూశామని అధికారి తెలిపారు. ART (యాంటీరెట్రో వైరల్ థెరపీ) కేంద్రాలలో 8,729 మందిని నమోదు చేశాం. మొత్తం హెచ్ఐవీతో బాధపడుతున్న వారి సంఖ్య 5,674. వీరిలో 4,570 మంది పురుషులు కాగా, 1,103 మంది మహిళలు ఉన్నారు. ఆ బాధితులలో ఒకరు మాత్రమే ట్రాన్స్జెండర్గా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జాయింట్ డైరెక్టర్ భట్టాచార్జీ మాట్లాడుతూ.. వివిధ విద్యార్థులు ఒకే ఇన్ఫెక్షన్ డ్రగ్ ఇంజక్షన్ను వాడడం వల్లే హెచ్ఐవి కేసులు పెరిగాయన్నారు. చాలా సందర్భాలలో సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు హెచ్ఐవి బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. తల్లితండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి తమ పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడ్డారని తెలుసుకునే సమయానికి వారి డిమాండ్లను నెరవేర్చడానికి వెనుకాడని కుటుంబాలు కూడా ఉన్నాయి.