Summer: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమ్మర్ రాకపోకల కోసం ప్రత్యేక రైళ్లు
- By Balu J Published Date - 11:44 PM, Mon - 22 April 24
Summer: వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ – సికింద్రాబాద్, గోరక్పూర్-మహబూబ్నగర్, మహబూబ్నగర్ – గోరక్పూర్, కొచ్చువెలి-షాలిమార్, షాలిమార్-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్పూర్, భువనేశ్వర్-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్, తిన్సుకియా-బెంగళూరు, జబల్పూర్-కన్యాకుమారితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ముజఫరాబాద్-సికింద్రాబాద్ (05293) మధ్య మంగళవారం ఈ నెల 23 నుంచి జూన్ 25 వరకు పది ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్-ముజఫరాబాద్ (05294) ప్రతి గురువారం ఈ నెల 25 నుంచి జూన్ 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గోరక్పూర్-మహబూబ్నగర్ (05303) మధ్య ఈ నెల 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం రైలు నడిపించనున్నట్లు చెప్పింది. మహబూబ్నగర్-గోరక్పూర్ (05304) మధ్య ఈ నెల 22 నుంచి జులై ఒకటి వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.