Gold Price: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా ఉన్నాయి.
- By Gopichand Published Date - 07:41 AM, Tue - 26 December 23

Gold Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,490గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ. 80,700కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (డిసెంబర్ 26, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Indian Warships : మూడు యుద్ధనౌకలను ‘అరేబియా’లో మోహరించిన భారత్
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,640గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,150గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.63,490 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 79,200 ఉండగా, ముంబైలో రూ.79,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,7000 ఉండగా, కోల్కతాలో రూ.79,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,750 ఉండగా, కేరళలో రూ.80,700గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, విజయవాడలో రూ.80,700 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.