Gold Prices: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కూడా తగ్గాయి. శనివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది.
- Author : Gopichand
Date : 20-05-2023 - 6:57 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Prices) నేడు కూడా తగ్గాయి. శనివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Prices) రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (మే 20, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,020గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,250 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920గా ఉంది.
Also Read: NTR 30 : అందరు అనుకున్నదే.. NTR 30వ సినిమా ‘దేవర’
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,300 ఉండగా, ముంబైలో రూ.74,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, కోల్కతాలో రూ.74,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, కేరళలో రూ.78,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, విజయవాడలో రూ.78,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.