Gold Price: ఈరోజు బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలలో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు తగ్గాయి. గురువారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.56,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,420గా నమోదైంది.
- Author : Gopichand
Date : 18-05-2023 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు తగ్గాయి. గురువారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.56,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,420గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,800కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (మే 18, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: ASTR War On Fake Sims : 36 లక్షల ఫేక్ సిమ్స్ బ్లాక్.. ఏమిటీ ASTR ?
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,570గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,420 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,600 ఉండగా, ముంబైలో రూ.74,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,200 ఉండగా, కోల్కతాలో రూ.74,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.78,200 ఉండగా, కేరళలో రూ.78,200గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,200 ఉండగా, విజయవాడలో రూ.78,200 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.