Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో నేటి గోల్డ్ రేట్స్ ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,130గా నమోదైంది.
- By Gopichand Published Date - 07:08 AM, Fri - 12 May 23
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,130గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.82,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మే 12, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Phones: ఫోన్లు వాడేవారికి హెచ్చరిక.. వెంటాడుతున్న ఆ వ్యాధి.. నలుగురిలో ఒకరికి..
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,280గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,370 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,590గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,130 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,130గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,180గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,600 ఉండగా, ముంబైలో రూ.77,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000 ఉండగా, కోల్కతాలో రూ.77,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.82,000 ఉండగా, కేరళలో రూ.82,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.82,000 ఉండగా, విజయవాడలో రూ.82,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
MDH- Everest: భారత్లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.