Ganja : హైదరాబాద్లో ఇద్దరు గంజాయి వ్యాపారుల అరెస్ట్.. 7.2 కేజీల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు గంజాయి వ్యాపారులను అరెస్ట్ చేశారు. మాదాపూర్ జోన్లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్
- By Prasad Published Date - 09:06 PM, Fri - 17 March 23
హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు గంజాయి వ్యాపారులను అరెస్ట్ చేశారు. మాదాపూర్ జోన్లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) సిబ్బంది, జీడిమెట్ల పోలీసులు సంయూక్తంగా ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి 7.2 కిలోల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శంషీగూడలోని ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్న ఎ.మోహన్ గా పోలీసులు గుర్తించారు. మోహన్ స్వస్థలం గుంటూరు జిల్లా దాచేపల్లి నారాయణపురంగా గుర్తించారు.మరో నిందితుడు హైదరాబాద్లోని గాంధీనగర్కు చెందిన బి. యశ్వంత్ (విక్రేత), వైజాగ్కు చెందిన శ్యామ్కుమార్ ప్రధాన సరఫరాదారుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన శ్యామ్కుమార్ గత మూడేళ్లుగా వైజాగ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Related News
KCR: ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బిఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్
KCR: దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికిచేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి ,పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప�