Telangana: జహీరాబాద్లో 70 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్ట్
- By Balu J Published Date - 09:38 AM, Mon - 1 April 24
Telangana: ఎక్సైజ్ స్టేట్ టాస్క్ టీమ్ 70 కిలోల (కేజీలు) గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వారి నుంచి ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం మార్చి 30 రాత్రి జహీరాబాద్కు చెందిన మహ్మద్ మొయిన్ (44), మహమ్మద్ ఖాజా (34), జర్ప్లా శ్రీనివాస్ (46), మహ్మద్ ఇస్మాయ్ (28)లను పట్టుకున్నారు. నిందితులు ముఠాగా ఏర్పడి జహీరాబాద్/నారాయణఖేడ్ నుంచి గంజాయి విక్రయిస్తున్నారు.
పట్టుబడిన గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్లోని ధూల్పేట్, నానక్రామ్గూడ, కర్ణాటక రాష్ట్రం బీదర్లో స్థానిక చిరువ్యాపారులకు విక్రయిస్తున్నారు. మార్చి 30, 31 తేదీల్లో జహీరాబాద్లోని వై జంక్షన్, శివాలయం రోడ్డు సమీపంలో జరిపిన సోదాల్లో నిందితులు గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను గుర్తించారు. తదుపరి శోధనలు కొనసాగుతున్నాయి
Related News
Hyderabad: గేమింగ్ అడ్డాపై పోలీసులు దాడులు.. లేడీ డాన్ అరెస్ట్, భారీ నగదు స్వాధీనం
Hyderabad: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నా అక్రమంగా కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్, వ్యభిచారం, మూడు ముక్కలాట లాంటి కార్యాకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఓ లేడీ డాన్ ను అరెస్ట్ చేశారు. లేడీ డాన్ అక్రమంగా నిర్వహిస్తున్న గేమింగ్ అడ్డా పై సైబరాబాద్ SOT దాడి చేశారు. రూ.62,620 నగ