Kolkata Airport: కోల్కతా విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం.. పరుగులు తీసిన ప్రయాణీకులు
కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kolkata Airport) బుధవారం (జూన్ 14) రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 06:51 AM, Thu - 15 June 23
Kolkata Airport: కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kolkata Airport) బుధవారం (జూన్ 14) రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొంత సేపటి తర్వాత మంటలు అదుపులోకి రావడంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్ లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలను కోల్కతా విమానాశ్రయ అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగేగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. రాత్రి 9.12 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
#Breaking | Fire breaks out inside Netaji Subhash Chandra Bose International (Kolkata) Airport. pic.twitter.com/xl2gMS09X4
— DD News (@DDNewslive) June 14, 2023
Also Read: KA Paul: పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందన్న కేఏ పాల్.. ఎలా అంటే..
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ (ఎన్ఎస్సిబిఐ) ఎయిర్పోర్ట్ కోల్కతా చెక్-ఇన్ ఏరియా పోర్టల్ డి వద్ద రాత్రి 9.12 గంటల సమయంలో చిన్నపాటి మంటలు, పొగలు వచ్చినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. రాత్రి 9.40 గంటలకు అదుపులోకి వచ్చింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. చెక్-ఇన్ ప్రాంతంలో పొగ ఉండటంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇప్పుడు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని పేర్కొంది. డి పోర్టల్ చెక్-ఇన్ కౌంటర్లో మంటలు చెలరేగినట్లు సిఐఎస్ఎఫ్ తెలిపింది. టెర్మినల్ భవనం నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మంటలు ఆర్పివేయబడ్డాయి. సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించబడుతున్నాయి.
జ్యోతిరాదిత్య సింధియా ఏం చెప్పారు?
అదే సమయంలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ ఘటనపై ట్వీట్ చేశారు. కోల్కతా ఎయిర్పోర్ట్లోని చెక్-ఇన్ కౌంటర్ దగ్గర దురదృష్టవశాత్తూ స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఎయిర్పోర్టు డైరెక్టర్తో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎటువంటి గాయాలు నివేదించబడలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకుంటామన్నారు.
Related News
West Bengal Governor: గవర్నర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన ఆనంద బోస్
: పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజకీయాలకు ప్రతిగా విపక్షాలను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.