HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Exactly 12 Years Later The Palem Incident Is Repeated The Road Of Death Is National Highway 44

Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

  • By Vamsi Chowdary Korata Published Date - 01:32 PM, Fri - 24 October 25
  • daily-hunt
Bus Accident's
Bus Accident's

కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్‌తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీల వెలికితీతను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చిన్నటేకూరు ప్రమాద స్థలికి ఫోరెస్సిక్ సిబ్బంది చేరుకున్నారు. అక్కడే ఇంక్వెస్ట్ పోస్ట్‌మార్టం పక్రియను చేపట్టనున్నారు. అదేవిధంగా డీఎన్‌ఏ ద్వారా డెడ్‌బాడీలను గుర్తించి మృతుల కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘పాలెం’ ప్రమాదం రిపీట్..

సరిగ్గా 12 సంవత్సరాల క్రితం.. అక్టోబర్ 30, 2013లో బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బస్సు ఓ కారును ఓవర్‌టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డీజిల్ ట్యాంక్ లీక్ అయి పేలుడు సంభవించడంతో ఆ దుర్ఘటనలో మొత్తం 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. వారిలో అంతా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఉన్నారు. ఈ ప్రమాదంలో కేవలం బస్సు డ్రైవరుతో పాటు క్లీనర్, ఐదుగురు ప్రయాణికులు మాత్రమే మృత్యుంజయులుగా బయటపడ్డారు.

సీఐడీ ఎంక్వైరీ..

మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనపై సీఐడీ పోలీసులు కేంద్రానికి 400 పేజీల నివేదికను సమర్పించారు. బస్సు ప్రమాదానికి గల పలు కారణాలను అందులో పొందుపరిచారు. ఛార్జీషీటులో నాడు ఆర్ అండ్ బీ అధికారులు, జబ్బార్ ట్రావెల్స్, జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి పేర్లను కూడా చేర్చారు. వోల్వో బస్సుల తయారీలోనే లోపాలు ఉన్నాయని, ఆ నివేదికలో అధికారులు వెల్లడించారు. నిబంధనలను విరుద్ధంగా బస్సులో సీట్లను మార్చేశారని రిపోర్టులో తెలిపారు. టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండటం వల్లే బస్సుకు త్వరగా మంటలు వ్యాపించాయని నిర్ధారించారు. ఆ డీజిల్ ట్యాంక్ కూడా ఘోర ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ లోపం, సీట్లు పెంచడం, బస్సులో ఓవర్ లోడ్ లగేజీ, ప్రమాదకర వస్తువులు ప్రమాదానికి కారణమని సీఐడీ అధికారుల విచారణలో వెల్లడైంది.

కర్నూలు (Kurnool) శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల వెలికితీత ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ రూ.5 లక్షలు, అదేవిధంగా క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించినట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bus accident
  • kurnool
  • Kurnool Bus Accident
  • Kurnool Bus Fire
  • National highway

Related News

Chandrababu

CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఘోర విషాదాన్ని (Vemuri Kaveri Travels Bus Accident) మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ ను ఢీ కొట్టినా ఆగకపోవడంతో.. 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులు, సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణాశాఖ […

  • Kurnool Bus Fire Accident

    Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

  • Kaveri Travels

    Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

  • Kurnool Bus Accident

    Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

  • Kurnool Bus Fire

    Kurnool Bus Fire: క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన బ‌స్సు, వీడియో ఇదే!

Latest News

  • Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!

  • Water: నీళ్లు తాగడానికీ ఒక సమయం ఉందట.. ఇది నిపుణుల మాట

  • Vivo X300: వివో X300 సిరీస్: భారత్‌లో నూతన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల లాంఛ్ ఎప్పుడు?

  • PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!

  • Nara Rohit : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్..!

Trending News

    • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

    • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

    • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

    • HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

    • New Rules: అల‌ర్ట్‌.. న‌వంబ‌ర్ నుంచి కొత్త రూల్స్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd