President Elections : నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్
- By Prasad Published Date - 01:28 PM, Thu - 9 June 22
భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం నేడు (గురువారం) ప్రకటించనుంది. షెడ్యూల్ను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది మరియు ఆ రోజులోపు తదుపరి రాష్ట్రపతికి ఎన్నిక జరగాలి. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకోబడిన సభ్యులు, జాతీయ రాజధాని ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో సహా అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అదేవిధంగా రాజ్యసభ, ఇతర నామినేటేడ్, శాసన మండలి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలకు ఓటర్లు కారు. 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జూలై 17న నిర్వహించగా, కౌంటింగ్ జూలై 20న జరిగింది.
Related News
Mallikarjun Kharge : బీజేపీ వస్తే రాజ్యాంగం మారిపోతుంది
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ముస్లిం లీగ్కు ప్రతిరూపమని బీజేపీ చేసిన ఆరోపణను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు, ‘నరేంద్ర మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ ఎప్పుడూ విజయవంతం కాదన్నారు.