Rajasthan : మద్యం మత్తులో వృద్ధురాలిని చంపిన తాగుబోతు
తాను శివుడి అవతారమంటూ, ఆమె కోసమే శివుడు తనను పంపాడంటూ నమ్మబలికాడు
- By Sudheer Published Date - 08:05 PM, Sun - 6 August 23
మద్యం ఈ మత్తు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది..మద్యం లోపల పడితే చాలు.. మనిషి తనలోని మరో వ్యక్తిని బయటకు తీసుకొస్తాడు. ఆలా బయటకు వచ్చిన మరోమనిషి ఏంచేస్తాడో కూడా తెలియదు..మత్తు దిగితే కానీ అసలు వ్యక్తి మళ్లీ బయటకు రాడు. ఈ మద్యం మత్తు ఎన్నో నేరాలకు పాల్పడేలా చేస్తుంది. తాగిన మత్తులో ఏంచేస్తాడో..ఎవర్ని ఏమంటాడో..ఎక్కడికి వేళ్తాడో..కూడా అర్ధం కాదు. తాజాగా రాజస్థాన్ (Rajasthan) లో తాగిన మత్తు(Drunk Man)లో ఓ వృద్ధురాలిని చంపిన ఘటన అందర్నీ మాట్లాడుకునేలా చేసింది.
ఉదయ్పుర్జిల్లాకి చెందిన ప్రతాప్సింగ్(60) అనే వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి..ఊళ్లో నడిచి వెళ్తుండగా ఎదురుగా కల్కీ బాయి(85) అనే వృద్ధురాలు (Old woman ) ఎదురైంది. ఆమెను రోడ్ ఫై అపి..ఆమె పక్కనే కూర్చుని తాను శివుడి అవతారమంటూ, ఆమె కోసమే శివుడు తనను పంపాడంటూ నమ్మబలికాడు. ఆమె రాణి అంటూ.. చంపి బతికిస్తా అని మాయమాటలు చెప్పి..ఆమె కడుపులో బలంగా కొట్టాడు. ఆ పక్కనే ప్రతాప్సింగ్ అనే వ్యక్తి నిలువరించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కింద పడిన వృద్ధురాలి తలపై తన చేతిలో ఉన్న గొడుగుతో కొట్టాడు. తీవ్ర గాయాలైన కల్కీ బాయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వృద్ధురాలు మంత్రగత్తె అనే అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also : Beetroot: బీట్రూట్ తో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండిలా?
Tags
Related News
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.