Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు...
- By Prasad Published Date - 11:36 AM, Mon - 21 November 22
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో భక్తులు క్యూ కట్టారు. ఇటు శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్యా గర్భగుడి దర్శనాలను అధికారులు రద్దు చేశారు. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, కుమారారం, క్షీరారం, భీమారం, అమరారం ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. త్రిపురాంతకం, బైరవకోన, శ్రీకాళహస్తి, కపిలతీర్థం తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Related News
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుం�