indigo flight: విమానాన్ని ఢీ కొన్న పక్షి.. దెబ్బకు ఎమర్జెన్సీ ల్యాండిగ్?
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్న విమానాలకు సంబంధించిన వీడియోలు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. విమానాలు ప్రయాణిస్తున్న సమయం
- By Nakshatra Published Date - 04:25 PM, Mon - 4 September 23
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్న విమానాలకు సంబంధించిన వీడియోలు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. విమానాలు ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపాలు లేదంటే ప్రకృతి విపత్తుల కారణంగా ఫ్లైట్లను ఎమర్జెన్సీగా లాండింగ్ చేయడం లేదంటే ఫ్లైట్ లను రద్దు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇలా ఒక ఘటన మరువక ముందే అలాంటి ఘటనలు మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో సంస్థకు చెందిన ఒక విమానాన్ని టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో తాజాగా చోటు చేసుకుంది. ఇండిగో సంస్థకు చెందిన 6E2065 విమానం 180 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఒక పక్షి విమానాన్ని ఢీకొట్టింది.
దీంతో విమానం ఎడమ రెక్కలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. దాంతో వెంటనే విమానాన్ని అత్యవసరంగా భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు.
Related News
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.