Case Filed Against MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం కేసు.. రేపు ఢిల్లీలో విచారణ..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు (Case Filed Against MS Dhoni) దాఖలైంది. అతని ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, మిహిర్ భార్య సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు.
- By Gopichand Published Date - 08:22 AM, Wed - 17 January 24
Case Filed Against MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు (Case Filed Against MS Dhoni) దాఖలైంది. అతని ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, మిహిర్ భార్య సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు. దీని విచారణ జనవరి 18న జరగనుంది. ఆర్కా స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు చెందిన మిహిర్, సౌమ్యలపై కొన్ని రోజుల క్రితం ధోనీ రాంచీ సివిల్ కోర్టులో మోసం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 15 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ధోనీపై కేసు పెట్టడానికి కారణం ఇదే
తనపై నమోదైన కేసులో కోర్టు ఏదైనా ఖచ్చితమైన ముగింపు ఇవ్వడానికి ముందే ధోనీ తరపు న్యాయవాది దయానంద్ శర్మ జనవరి 6, 2024న విలేకరుల సమావేశం నిర్వహించి అతనిపై ఆరోపణలు చేశారని మిహిర్ చెప్పాడు. మిహిర్, సౌమ్య ఈ ఆరోపణలను మీడియా అతిగా చేసి తమ ప్రతిష్టను దిగజార్చిందని అంటున్నారు. పరువునష్టం కేసు వేస్తూనే ధోనీ ప్రతిష్టకు భంగం కలిగించేలా చూడాలని డిమాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. ధోనీ, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, అనేక మీడియా సంస్థలపై శాశ్వత నిషేధం, పరిహారం కోరుతూ మిహిర్, సౌమ్య హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: 3rd T20I: నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20.. బెంగళూరులో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
వ్యవహారం వ్యాపార ఒప్పందానికి సంబంధించినది
2017లో ధోనీ, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మధ్య ఒక వ్యాపార ఒప్పందం కుదిరింది. దీని కింద భారతదేశం, విదేశాలలో క్రికెట్ అకాడమీలు తెరవబడతాయి. ఈ ఒప్పందంలో అంగీకరించిన షరతులను తరువాత పాటించలేదని ధోనీ ఇటీవల ఆరోపించారు. ధోనీ తరపు న్యాయవాది ప్రకారం.. కెప్టెన్ కూల్ మొత్తం ఫ్రాంచైజీని పొందాలని, లాభాలను ధోనీ, అతని భాగస్వామి మధ్య 70:30 ప్రాతిపదికన విభజించాలని అంగీకరించారు. కానీ వ్యాపార భాగస్వామి ధోనీకి తెలియకుండానే అకాడమీని తెరవడం ప్రారంభించాడు. ధోనీకి డబ్బు కూడా చెల్లించలేదు. ఈ విషయంపై తన భాగస్వాములతో ధోనీ చాలా సార్లు చర్చించాడు. కానీ ఫలితం లభించలేదు. ధోనీ వారితో అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
Tags
Related News
IPL 2024 : లక్నో ఫై ఓపెనర్ల ఊచకోత..SRH ఘనవిజయం
ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలోపే విజయం వరించింది. ఈ విజయంతో సన్రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి