COVID-19: శనివారం నమోదైన కరోనా కేసులు 339
దేశంలో ఒకేరోజు 339 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,492 గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా ప్రభావం కారణంగా మరణాల సంఖ్య 5,33,311 (5.33 లక్షలు)గా నమోదైంది,
- By Praveen Aluthuru Published Date - 05:19 PM, Sat - 16 December 23

COVID-19: దేశంలో ఒకేరోజు 339 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,492 గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా ప్రభావం కారణంగా మరణాల సంఖ్య 5,33,311 (5.33 లక్షలు)గా నమోదైంది, ఉదయం 8 గంటలకు నమోదైన డేటా ప్రకారం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,50,04,481 (4.50 కోట్లు) అని తేలింది. ఈ వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య ప్రస్తుతం 4,44,69,678 (4.44 కోట్లు) ఉండగా జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు సరఫరా చేశారని సమాచారం.
Also Read: CM Revanth Reddy: పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశాలు