HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Good News To Mudiraj

Congress Jana Jathara : ముదిరాజ్‌లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.

  • Author : Sudheer Date : 15-04-2024 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cng Narayanapet
Cng Narayanapet

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ..ముదిరాజ్‌ (Mudiraj)లకు కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన కాంగ్రెస్ పార్టీ..లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేయాలనీ చూస్తుంది. ఇందులో భాగంగా జనజాతర పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తూ..ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నారాయణ పేట జిల్లాలో జనజాతర పేరిట బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. ముదిరాజ్‌లకు కీలక హామీ ఇచ్చారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు పోరాడుతామని ప్రకటించారు. ముదిరాజ్ లను బీసీ-ఏలోకి మార్చాలనే కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంటే పదేళ్లు పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ప్రకారం ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అది కూడా ఒకేసాచేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసేదే లేదన్నారు. ఇదే సందర్బంగా కేసీఆర్ ఫై విమర్శల వర్షం కురిపించారు. ప్రజల కోసం ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలేదు కనుకనే.. వంద అడుగుల గోతిలో బీఆర్ఎస్ ను పాతిపెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పక్కనుంచే కృష్ణా నది పారుతున్నా సరే బీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో.. చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. అందుకే రూ.4వేల కోట్లతో మక్తల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి… లక్షా 30 వేల ఎరకాలకు నీళ్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ను కేటాయించిందని.. కానీ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి దాన్ని ఆపించిందని అన్నారు. అయినాగానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వికారాబాద్-కృష్ణా రైల్వే జోన్ తీసుకువస్తామన్నారు.

అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఫై కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ‘జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, BRSను మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. BRS ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో BRS నేతలు ప్రచారమే చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

Read Also : Janasena : సీఎం జగన్ ఫై దాడిని పుష్ప మేకింగ్ తో షేర్ చేసిన జనసేన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • janajathara
  • Lok Sabha Elections
  • mudiraj
  • Narayanpet

Related News

siddaramaiah-and-dk-shivakumar

Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసు

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd