HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Chandrababus Interesting Remarks On Jamili Elections

CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.

  • Author : Kode Mohan Sai Date : 14-12-2024 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu On Jamili Elections
Cm Chandrababu On Jamili Elections

CM Chandrababu On Jamili Elections: జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లుకు ఆమోదం తెలిపింది, మరియు ఈ బిల్లు ఈ నెల 16 న పార్లమెంట్‌ ముందుకు  రాబోతోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే జరుగుతాయని తెలిపారు. “ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానానికి మా మద్దతు ఎప్పుడో ప్రకటించాం” అని ఆయన చెప్పారు.

వైసీపీ నేతలపై ఆయన విమర్శలు చేసిన ఆయన, జమిలీ ఎన్నికలపై అవగాహన లేకుండా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని వైసీపీ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. “వైసీపీ పబ్బం గడుపుకోవడానికే ఏదిపడితే అది మాట్లాడుతోందని” ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని, “వాళ్ల డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు” అని సెటైర్లు వేశారు.

సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు సీఎం చంద్రబాబు:

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న మనోభావాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజన్ పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి స్థాయిలో చర్చలు జరగాలని ఆయన సూచించారు.

“విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరానికి తెలియాలి,” అని ఆయన అన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను, 2020 నాటి పరిణామాలను పోల్చుకుంటే, విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047లో కూడా ఈ మార్పులు చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను “ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్రమం” కాదని, భవిష్యత్తు తరాల సార్ధకత కోసం ఈ ప్రయత్నం చేపట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. “ఈ విజన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై, రేపటి తరాల భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు”.

కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ కోసం ఆకాంక్ష

సాగునీటి సంఘాలు, సహకార, ఇతర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈసారి నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అనేక మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. “సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు.

ముందుగానే, కలెక్టర్లు మరియు ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండాను పంపించి, వాటిపై సమాధానాలు కోరుతామని తెలిపారు. “ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం, అలాగే మంత్రులు-అధికారుల మధ్య ఇంటరాక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “అద్వాణీతో నాకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది” అని సీఎం చంద్రబాబు అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Accepts Jamili Election Bill
  • CM Chandrababu
  • CM chandrababu On Jamili Elections
  • Jamili Election Bill
  • narendra modi
  • One Nation One Election

Related News

Hussain Hassan Mirza

మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది

UAE Ambassador ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకగల శక్తి ఒక్క భారతదేశానికే ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఓ జాతీయ వార్తా సంస్థతో

  • Manoj Babu

    Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

  • Govt asks refiners to maximise LPG production

    యుద్దం వేళ వంటగ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు..

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

  • Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

Trending News

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd