HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Chandrababus Interesting Remarks On Jamili Elections

CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.

  • Author : Kode Mohan Sai Date : 14-12-2024 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu On Jamili Elections
Cm Chandrababu On Jamili Elections

CM Chandrababu On Jamili Elections: జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లుకు ఆమోదం తెలిపింది, మరియు ఈ బిల్లు ఈ నెల 16 న పార్లమెంట్‌ ముందుకు  రాబోతోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే జరుగుతాయని తెలిపారు. “ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానానికి మా మద్దతు ఎప్పుడో ప్రకటించాం” అని ఆయన చెప్పారు.

వైసీపీ నేతలపై ఆయన విమర్శలు చేసిన ఆయన, జమిలీ ఎన్నికలపై అవగాహన లేకుండా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని వైసీపీ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. “వైసీపీ పబ్బం గడుపుకోవడానికే ఏదిపడితే అది మాట్లాడుతోందని” ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని, “వాళ్ల డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు” అని సెటైర్లు వేశారు.

సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు సీఎం చంద్రబాబు:

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న మనోభావాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజన్ పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి స్థాయిలో చర్చలు జరగాలని ఆయన సూచించారు.

“విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరానికి తెలియాలి,” అని ఆయన అన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను, 2020 నాటి పరిణామాలను పోల్చుకుంటే, విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047లో కూడా ఈ మార్పులు చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను “ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్రమం” కాదని, భవిష్యత్తు తరాల సార్ధకత కోసం ఈ ప్రయత్నం చేపట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. “ఈ విజన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై, రేపటి తరాల భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు”.

కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ కోసం ఆకాంక్ష

సాగునీటి సంఘాలు, సహకార, ఇతర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈసారి నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అనేక మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. “సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు.

ముందుగానే, కలెక్టర్లు మరియు ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండాను పంపించి, వాటిపై సమాధానాలు కోరుతామని తెలిపారు. “ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం, అలాగే మంత్రులు-అధికారుల మధ్య ఇంటరాక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “అద్వాణీతో నాకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది” అని సీఎం చంద్రబాబు అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Accepts Jamili Election Bill
  • CM Chandrababu
  • CM chandrababu On Jamili Elections
  • Jamili Election Bill
  • narendra modi
  • One Nation One Election

Related News

CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

దేశంలో ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలో గౌరవనీయులైన వ్యక్తులను అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది ఆవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేయబడింది.

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • PM Modi

    11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

Latest News

  • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

  • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd