Gold Rates: వరసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి.
- By Gopichand Published Date - 07:27 AM, Sat - 23 September 23
Gold Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,840గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.79,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (సెప్టెంబర్ 23, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Rain Alert : తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. ఏపీలోని 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,940గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,840 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా, ముంబైలో రూ.75,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, కోల్కతాలో రూ.75,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,250 ఉండగా, కేరళలో రూ.79,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, విజయవాడలో రూ.79,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే, గూగుల్ పే ముందంజ..!
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ రంగం టెలికాం బాటలో నడుస్తోంది.