Rain Alert : తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. ఏపీలోని 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
Rain Alert : ఈరోజు, రేపు రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
- By Pasha Published Date - 07:09 AM, Sat - 23 September 23
Rain Alert : ఈరోజు, రేపు రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం జరుగుతున్నందున.. దాని ప్రభావంతో డిసెంబర్ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Also read : Taiwan Golf Factory Fire: దక్షిణ తైవాన్లోని గోల్ఫ్ ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి గాయాలు
‘‘ఈరోజు ఉదయం ఉత్తరాంధ్రలో జల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం 2 వరకూ కోస్తా, ఉత్తర తెలంగాణలో చిరు జల్లులు కురుస్తాయి. సాయంత్రం 5 తర్వాత కోస్తాలో జల్లులు, ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు వాన పడుతుంది. ఇవాళ రాత్రికి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు వాన పడే ఛాన్స్ ఉంది. శనివారం రాత్రి తర్వాత ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి వాన పడుతుంది’’ అని అధికారులు చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల, ఏలూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందన్నారు.
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.