Gold Prices: షాక్ ఇస్తున్న గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Prices) నేడు మరోసారి పెరిగాయి.
- By Gopichand Published Date - 07:40 AM, Wed - 20 September 23
Gold Prices: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Prices) నేడు మరోసారి పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,220గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,300కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (సెప్టెంబర్ 20, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,370గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,220 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,220గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,220గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,800 ఉండగా, ముంబైలో రూ.74,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,300 ఉండగా, కోల్కతాలో రూ.74,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,250 ఉండగా, కేరళలో రూ.78,300గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,300 ఉండగా, విజయవాడలో రూ.78,300 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.. 180 మంది ప్రయాణికులు సేఫ్
మహారాష్ట్రలోని పూణె విమానాశ్రయంలో గురువారం (మే 16) పెను ప్రమాదం తప్పింది.