HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Centers Sensational Decision On Lic

LIC India : ఎల్‌ఐసీ పై కేంద్రం సంచలన నిర్ణయం..!

ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అడుగులు వేస్తోంది.

  • Author : Maheswara Rao Nadella Date : 09-12-2022 - 4:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
LIC Central Government
Lic

ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అడుగులు వేస్తోంది. భారతీయ జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India)లో నాలుగు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేసేందుకు ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన చట్టాలను సవరించేందుకు ప్రయత్నిస్తోంది. కాంపోజిట్ ఇన్సూరర్లకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఈ పరిణామాలను ఈ సంస్థల ఉద్యోగులు కూడా స్వాగతిస్తున్నారు.

బీమా రంగ నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం (Central Government) కాంపోజిట్ ఇన్సూరర్లను అనుమతించాలని ప్రతిపాదించింది. జీవిత బీమా పాలసీలను, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆస్తులు, వాహనాలు వంటివాటి కోసం) పాలసీలను అమ్మే బీమా సంస్థనే కాంపోజిట్ ఇన్సూరర్ అంటారు. ఈ ప్రతిపాదనల అమలు కోసం ఇన్సూరెన్స్ యాక్ట్, 1938 ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్, 1999లలోని వివిధ నిబంధనలను సవరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిపాదనలు ఏమిటంటే, కాంపోజిట్ ఇన్సూరర్లను అనుమతించడం, అవసరమైన కనీస పెట్టుబడిని నిర్ణయించే అధికారాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌కు కల్పించడం, చట్టపరమైన పరిమితులను రద్దు చేయడం, పెట్టుబడుల నిబంధనలను మార్చడం, కేప్టివ్స్, ఇతరులు సహా ఇతర రకాల ఇన్సూరర్లకు అనుమతి ఇవ్వడం.

స్ట్రాటజిక్ సెక్టర్స్‌లో నాలుగు పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఉండవచ్చునని, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్‌లో ఒకే ఒక ప్రభుత్వ యాజమాన్యంలోని యూనిట్ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) గతంలో చేసిన ప్రకటనను బీమా రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వం తన నాలుగు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎల్ఐసీ (LIC)లో విలీనం చేయవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఆ కంపెనీలు ఏమిటంటే, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ నాలుగు కంపెనీల ఉద్యోగ సంఘాలు కూడా ఈ పరిణామాలను స్వాగతిస్తున్నాయని చెప్తున్నారు. ఏకైక బలమైన సంస్థగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ (Central Government) యాజమాన్యంలో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC Re), ECGC Ltd, Agriculture Insurance Company of India Ltd. వీటిలో GIC Re అనేది నేషనల్ రీఇన్సూరర్ కాగా, ECGC, వ్యవసాయ బీమా కంపెనీలు స్పెషలైజ్డ్ బిజినెస్ యూనిట్లు. వ్యవసాయ బీమా కంపెనీని కూడా తర్వాతి దశలో ఎల్ఐసీ (LIC)లో విలీనం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆలిండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ త్రిలోక్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను బలోపేతం చేసే చర్యలను తాము స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

Also Read:  Cyclone Mandaus: ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • india
  • LIC
  • Speed News
  • viral

Related News

Ban on Telegram app: Delhi High Court's key verdict

Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్‌ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరిస్థితుల దృష్ట్యా కేంద్రం తీసుకున్న చర్య సమంజసమేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ‘‘అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో తప్పు కనిపించడం లేదు’’ అని పేర్కొంది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd