Liquor Scam : డిప్యూటీ సీఎంతో పాటు 13 మందిపై లుక్ అవుట్ సర్య్కూలర్ జారీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా 14 మంది
- Author : Prasad
Date : 21-08-2022 - 10:12 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా 14 మంది నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. వారు విదేశాలకు వెళ్లకుండా . నిరోధించడానికి ఈ సర్క్యూలర్ జారీ చేసింది. సోదాల్లో ఇద్దరు నిందితులను సీబీఐ కనుగొనలేకపోయింది. సీబీఐ తన ఎఫ్ఐఆర్లో సిసోడియాను మొదటి నిందితుడిగా పేర్కొంది. IPCలోని సెక్షన్లు 120B (నేరపూరిత కుట్ర) మరియు 477A (ఖాతాల తప్పుడు సమాచారం) కింద CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మద్యం వ్యాపారులకు రూ.30 కోట్ల మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలు సిసోడియాపై ఉన్నాయి.