2 Killed : ముంబైలో భారీ వర్షాలకు కూలిన భవనం.. ఇద్దరు మృతి
ముంబైలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు
- By Prasad Published Date - 07:43 AM, Mon - 26 June 23
ముంబైలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. రెండంతస్తుల భవనం బాల్కనీ కూలిపోయింది. నగరంలోని పశ్చిమ శివారులోని విలే పార్లే ప్రాంతంలోని నానావతి ఆసుపత్రి సమీపంలోని సెయింట్ బిర్సే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ముంబై అగ్నిమాపక శాఖ (ఎంఎఫ్డి) శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల సహాయంతో రెస్క్యూ బృందాలు ఐదుగురిని రక్షించి కూపర్ ఆసుపత్రికి పంపించాయి. అయితే ఆ తర్వాత ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఇలాంటి మరొక సంఘటనలో, ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రక్షించింది.
Related News
Brazil : బ్రెజిల్లో భారీ వర్షాలు..కొండచరియలు విరిగి 37 మంది మృతి
Brazil: బ్రెజిల్లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ భారీ వర్షాలతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం, 74 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. 37 మంది మృతి చెందారు. అంతేకాక చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుగా అక్కడి వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కూలిపోయిన ఇళ్లు, వంతెనలు మరియు రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి �